యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
కాగా ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా మలిచడంలో సుజీత్ సక్సెస్ అయ్యాడు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయగా బాలీవుడ్లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
అయితే ఈ సినిమాకు బాలీవుడ్ జనాలు ఇప్పటికీ పట్టం కడుతూనే ఉన్నారు.ఇప్పటికే మూడుసార్లు ఈ సినిమాను బాలీవుడ్లో బుల్లితెరపై ప్రదర్శించారు.కాగా తొలిసారి సాహో చిత్రానికి ఏకంగా 1 కోటి 28 లక్షల వ్యూవర్షిప్ను రాబట్టింది.ఇక రెండోసారి 52 లక్షల వ్యూవర్షిప్ రాగా, ఇటీవల మూడోసారి ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా 83 లక్షల వ్యూవర్షిప్ను దక్కించుకుంది.
ఇలా బాలీవుడ్ జనాలు సాహో చిత్రానికి అదిరిపోయే ఆదరణ ఇస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
ప్రభాస్ పూర్తిగా అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపించగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మేర కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తుండగా ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.