తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “ఆర్ఎక్స్100” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ “పాయల్ రాజ్ పుత్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వచ్చీరావడంతోనే ఈ అమ్మడు బాక్సాఫీసు వద్ద మంచి హిట్ ను అందుకుంది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆర్ఎక్స్ 100 చిత్రం అంతటి రేంజ్ లో హిట్ ని అందుకోలేకపోయింది.దీంతో తన కంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక బాగానే సతమతమవుతోంది.
ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
ఈ క్రమంలో తాజాగా పాయల్ రాజ్ పుత్ ఓ ప్రముఖ ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని టోపీ అడ్డుపెట్టుకొని పలు ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.
అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ అమ్మడి అందాలకు ఫిదా అయ్యారు.అయితే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన శరీరాన్ని కప్పి ఉంచిన టోపీని పక్కకు తీసి వెనకవైపు ఏముందో చూపించాలంటూ కొంతమేర అసభ్యకరంగా కామెంట్ చేశాడు.
దీంతో పాయల్ రాజ్ పుత్ తనదైన శైలిలో స్పందిస్తూ ఈ వయసులో ఇలా అడగడం “మీకు సిగ్గు అనిపించడం లేదా.?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే నీ భార్యని వెళ్లి అడుగు లోపల ఏముందో తెలుస్తుందని ఘాటుగా రిప్లై ఇచ్చింది.
దీంతో పాయల్ రాజ్ పూర్తి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలబ్రిటీల పై అసభ్యకరంగా కామెంట్లు కావాలని చేస్తున్నారని ఇలాంటి వారికి పాయల్ రాజ్ పుత్ సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ అభినందిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య పాయల్ రాజ్ పుత్ “వెంకీమామ” చిత్రంతో పర్వాలేదనిపించినప్పటికీ వెంటనే “డిస్కో రాజా” చిత్రంతో దురదృష్టం వెంటాడింది.దీంతో ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుంది.కాగా ప్రస్తుతం తమిళంలో “ఏంజెల్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా అడుగు పెట్టబోతోంది.