పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం జరుపుకున్న పుట్టిన రోజు వేడుకల్లో భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు, తారాగణాలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎవరికీ అందని గౌరవం ఈ సారి జనసేన పార్టీ అధినేతకు దొరికింది.
ట్విట్టర్ లో సినీ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు పుట్టినరోజు శుభాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు.చాలా మంది సినీ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు.
కొందరూ గిఫ్టు పంపించారు.అభిమానులు వాడవాడలా భారీ ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు, జనసేన నాయకులు అధినేత పుట్టిన రోజు వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచుకున్నారు.
అయితే ఆర్ఎక్స్-100 సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.ఈ ముద్దుగుమ్మ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గిఫ్ట్ ను కూడా అందించింది.
అది వస్తువు రూపంలో కాకుండా వినూత్నంగా ఆలోచించి ఆ గిఫ్ట్ ను నటుడు పవన్ కళ్యాణ్ కు అంకితం చేసింది.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, బన్నీ, సూర్య, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అలాగే కొందరు కథానాయికలు పాల్గొని మొక్కలు కూడా నాటారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన పాయల్ రాజ్ పుత్ మొక్కలు నాటారు.
ఈ మేరకు ఆమె హీరోలు రవితేజ, సౌరబ్, కరణ్ శర్మ, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ లకు గ్రీన్ ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటాలన్నారు.అలా మొక్కలు నాటి గిఫ్ట్ రూపంలో పవర్ స్టార్ కు డెడికేట్ చేసింది ఈ ముద్దు గుమ్మ.