తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “ఆర్ఎక్స్100” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టి పడేసింది.
దీంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ బ్యూటీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు మాత్రం సరైన అవకాశాన్ని దక్కించుకోలేక పోయింది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.
కాగా తాజాగా పాయల్ రాజ్ పుత్ షేర్ చేసినటువంటి ఓ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో సోషల్ మీడియా మాధ్యమాలని ఇతరులని ఇంప్రెస్ చేయడానికి కాకుండా ప్రభావితం చేయడానికి ఉపయోగించాలని సూచించింది.
అలాగే సెలవులు గడిపేందుకు వెళ్ళినటువంటి సమయంలో తీసుకున్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల ఈ అమ్మడు “అనగనగా ఓ అతిథి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ ఓటిటి ఆహా లో విడుదల చేశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
కాగా ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తమిళంలో “ఏంజెల్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.