అప్పటి వరకు బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ వచ్చిన పాయల్ రాజ్ పుత్ ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది.అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయతో పాయల్ చేసిన రొమాన్స్ ఆమెకి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది.
అయితే ఆ సినిమా హిట్ తో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ కొన్ని సినిమాల్లో అదే తరహా పాత్రలు చేయడం తో కెరియర్ లో వెనకపడ్డది.యువ హీరోల సరసన నటిస్తూ వస్తున్న పాయల్ లేటెస్ట్ గా తెలుగులో ఓ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ షూటింగ్ లో ఆమె కెమెరా ముందు ఉండాల్సింది.కెమెరా వెనక ఉంది.
అదేంటి అంటే.సినిమాకు అమ్మడు సరదాగా కెమెరా మెన్ గా మారింది అన్నమాట.
తన టీం తో సరదాగా కెమెరా లో చూస్తూ ప్రొఫెషనల్ కెమెరా మెన్ లా బిల్డప్ ఇస్తుంది పాయల్ రాజ్ పుత్.ప్రస్తుతం పాయల్ కెమెరాం వెనక ఇచ్చిన ఫోటో స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కెరియర్ లో మరో ఆరెక్స్ 100 లాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న పాయల్ వచ్చిన ప్రతి ఆఫర్ ను చేస్తూ వెళ్తుంది.సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతో కూడా పాయల్ ప్రేక్షకులను అలరిస్తుంది.