ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి కి ఇప్పటికే 2 లక్షల మందికిపైగా మృతి చెందగా,30 లక్షల మందికి పైగా కరోనా బారిన పడిన వారిలో ఉన్న సంగతి తెలిసిందే.చైనా,అమెరికా,ఇటలీ,స్పెయిన్,ఫ్రాన్స్ లలో విశ్వరూపం చూపిన ఈ మహమ్మారి ఇప్పుడు రష్యా లో తీవ్ర స్థాయిలో ఉంది.
రష్యా లో మిలటరీ కి ఈ మహమ్మారి సోకడం మరింత ఆందోళన కలిగిస్తుంది.అక్కడి మిలటరీలో ఇప్పటివరకు 874 కరోనా కేసులు నమోదయ్యాయి.వారిలో 379మంది హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది.మిగిలినవారంతా వివిధ ప్రాంతాల్లోని మెడికల్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.మరో పక్క ఈ మహమ్మారి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్ని పురస్కరించుకొని మే 9 న జరిగే మిలటరీ పెరేడ్ ను కూడా రద్దు చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.వాస్తవానికి ప్రతి సంవత్సరం జరిగే ఈ పరేడ్ లో 15 వేల మంది మిలటరీ బలగాలు పాల్గొంటారు.
అయితే ప్రస్తుతం మిలటరీ లో కూడా కరోనా కల్లోలం సృష్టిస్తుండడం తో అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి సమయంలో ఈ పరేడ్ ను నిర్వహించడం మంచిది కాదని పుతిన్ అభిప్రాయపడ్డారు.రష్యాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 80,949కు చేరుకున్నాయి.747 మంది మృతిచెందారు.అయితే ఈ మహమ్మారి మిలటరీ కి కూడా పాకడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ మహమ్మారి ని ఎలా కట్టడి చేయాలా అని అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.