మరి కొద్ది రోజుల్లో రష్యా కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ ను రిలీజ్ చేయనుందని అధికారికంగా ప్రకటించింది.ఈ వైరస్ కు వ్యాక్సిన్ రాకముందే రష్యా శాస్త్రవేత్తలు మరో శుభవార్తను అందించారు.
కరోనాను సులభ పద్ధతిలో నియంత్రించవచ్చను వెల్లడించారు.ఈ ప్రయోగాన్ని ప్రజలు ఇళ్లలోనే చేసుకోవచ్చని చెప్పారు.
శర వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అన్ని దేశాలు ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో తెస్తున్నామని అధికారికంగా ప్రకటన కూడా చేసుకున్నాయి.ఇప్పటికే రష్యా కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ తీసుకొస్తున్నట్లు చెప్పినా తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.రష్యాకు చెందిన వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు కరోనాను కట్టడి చేయడానికి మార్గాన్ని కనుగొన్నారు.
ప్రతి రోజు వేడి నీటిని తాగడం ద్వారా శరీరంలో కరోనా వైరస్ వృద్ధి చెందదని తేల్చి చెప్పారు.30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన నీటిలో కరోనా వృద్ధి చెందలేదని, ఈ నీటిలో 90 శాతం వైరస్ చనిపోతుందన్నారు.24 గంటల పాటు వేడినీళ్లు తాగడం వల్ల 99.9 శాతం వైరస్ ను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు.క్లోరిన్ వాటర్, సముద్రపు నీటిలో వైరస్ మనుగడ ఉండదని, ఎక్కువ శాతం వేడి నీళ్లు తాగాలని శాస్త్రవేత్తలు సూచించారు.