టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ ఏడాదిలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న మహేష్, తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేసేందుకు దర్శకుడు పరశురామ్తో చేతులు కలిపాడు.
ఇక పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథ ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.అయితే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే బడా బాబుల పనిపట్టే పాత్రలో మహేష్ కనిపిస్తాడట.
మహేష్ బాబు చిన్నప్పటి నుండి కోటీశ్వరుడు కావాలనే కసితో పెరుగుతాడట.ఈ మేరకు రూపాయి విలువ తెలిసిన వ్యక్తిగా ఆయన సమాజంలో పెరుగుతాడట.
దీంతో రూపాయి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే, బ్యాంకులకు పంగనామం పెట్టిన వారి భరతం పట్టే పాత్రలో మహేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తాడట.మొత్తానికి రూపాయి విలువ ఎలా ఉంటుందనే విషయాన్ని మహేష్ మనకు ఈ సినిమాలో చూపించబోతున్నాడట.
ఇక ఈ సినిమాలో పలువురు నటీనటులు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచాలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ను వీలైనంత త్వరగా ప్రారంభించి, అంతే త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.హైదరాబాద్లో ఈ సినిమా కోసం ఓ భారీ బ్యాంక్ సెట్ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఏర్పాటు చేసింది.
సినిమాకు సంబంధించి మెజారిటీ శాతం షూటింగ్ ఈ సెట్లోనే జరగనుందట.మరి ఈ సినిమాలో రూపాయి విలువను ఎలా చూపిస్తారనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.