మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.చిరంజీవికి తాజాగా భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్ కు ఆహ్వానం దక్కింది.
వచ్చే నెల నాలుగో తేదీన ఈ కార్యక్రమం జరగనుందనే సంగతి తెలిసిందే.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ ను పంపారని సమాచారం అందుతోంది.
అయితే ఇదే సమయంలో చిరంజీవి కూతురు శ్రీజ మూడో పెళ్లి చేసుకోనున్నారని సోషల్ మీడియా, వెబ్ మీడియా వేదికగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.శ్రీజ చాలా సంవత్సరాల క్రితం శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడిపోయారు.ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ల వివాహం జరిగింది.
అయితే గత కొంతకాలంగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిగా ఉంటున్నారు.
మనస్పర్ధలు రావడం వల్లే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
అటు శ్రీజ కానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ వైరల్ అవుతున్న వార్తల గురించి రియాక్ట్ కావడానికి అస్సలు ఇష్టపడటం లేదు.అయితే గత కొన్నిరోజుల నుంచి కొంతమంది సెలబ్రిటీల మూడో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో శ్రీజ మూడో పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అయ్యాయని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో శ్రీజ మూడో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంలో మాత్రం ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది.మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్లు ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.శ్రీజ లేదా మెగా ఫ్యామిలీ నుంచి స్పందన వస్తే ఈ వార్తలు ఆగిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.