సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకుపోతోంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 20కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం.
ఇది సాయి కెరీర్లో అతిపెద్ద హిట్.ఈ ఊపుతో, ధరమ్ కి చాలానే ఆఫర్స్ వస్తున్నాయి.
వాటిని చూసుకోనే, గోపించంద్ మలినేని దర్శకుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ప్రారంభించిన సినిమాని తేజ్ క్యాన్సిల్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే వాటిలో వాస్తవం లేదని తేలిపోయింది.
దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ విషయం మీద స్పందిస్తూ ” నా సినిమా మీద ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మకండి.స్క్రిప్టు చివరి దశలో ఉంది.
ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్” అని చెప్పుకొచ్చారు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తిక్క అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లరిస్సా బొనెస్సి కథానాయికగా చేస్తోంది.