టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి.అందులోనూ బాలయ్య బాబు సినిమా అంటే అభిమానుల్లో ఎంత సందడిగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు.
అయితే నిన్నటి రోజున నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన రూరల్ చిత్రం విడుదల కాగా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే ఇదే రోజున మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి తేజ్ చిత్రం కూడా విడుదలైంది.
ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
అయితే పోటాపోటీన విడుదలైన ఈ రెండు చిత్రాలు ఇప్పటివరకు థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్నాయి.
ఒక పక్క బాలయ్య బాబు యాక్షన్ సీన్లు మరోపక్క సాయి తేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులు బాగానే అలరిస్తున్నాయి.అయితే సినీ విశ్లేషకులు మాత్రం గతంలో బాలయ్య బాబు తన తండ్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం కొంతమేర బాలయ్యకు ఊరట కలిగించిందని అంటున్నారు.
అలాగే చిత్రలహరితో ఫర్వాలేదనిపించినా సాయి తేజ్ తన ఫామ్ ని ఈ చిత్రం ద్వారా కొనసాగించాడనీ సినీ అభప్రాయపడుతున్నారు. అయితే ఈ రెండు చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని అనే విషయం ఇప్పటివరకూ తేలడం లేదు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్ర ఘాన విజయాన్ని సొతం చేసుకుందో తెలియాలంటే మరో వారం రోజులపాటు ఆగాల్సిందే.అయితే ప్రస్తుత ఈ చిత్రాల ఫలితాలు మరియు అభిమానుల సందడిని బట్టి చూస్తే బాలయ్యకు థియేటర్లలో సాయి తేజ్ గట్టి పోటీ ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
అయితే బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం ఘాన విజయం సాధిస్తుందో చూడాలి.
.