మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో కూడిన చిత్రం రుద్రమాంబపురం : హీరో శ్రీకాంత్

అజ‌య్ ఘోష్‌,( Ajay Ghosh ) శుభోద‌యం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.

సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం( Rudramanbapuram )`.మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌.ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు.

మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు.మూల కథ అజయ్ ఘోష్.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది.తాజాగా ఈ మూవీ నుండి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్( Srikanth ) గారు విడుదల చేసారు.

Advertisement

ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లి గంజ్( Rahul Sipligunj Indian playback singer ) పాడగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు.రుద్ర‌మాంబ‌పురం జులై 6నుండి హాట్ స్టార్ లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.ఎన్.వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ.ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.ఈ చిత్రంలో తిరుపతి పాత్ర లో అజయ్ గోష్, నటిస్తున్నారు, పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు ( subhodayam subbarao)న‌టిస్తున్నారు.

వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం: నిర్మాత‌: నండూరి రాము , ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు,బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్,క‌థ‌: అజ‌య్ ఘోష్,డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి సంగీతం: వెంగీ,ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రావు,ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు, ఫైట్స్‌: దేవ‌రాజు, కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు సీఈఓ: అన్నింగి రాజ‌శేఖ‌ర్‌,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను ,పీఆర్ఓ: శ్రీధర్.

Advertisement

తాజా వార్తలు