‘బాహుబలి’ చిత్రం కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చి మరే ఇతర చిత్రాలు కూడా ఆ సినిమా స్థాయిని చేరుకోలేని స్థితిలో నిల్చున్న విషయం తెల్సిందే.‘బాహుబలి’ నెం.1 స్థానంలో నిలువగా ఆ సినిమా తర్వాత వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం టాలీవుడ్ నెం.2 చిత్రంగా నిలిచింది.శ్రీమంతుడు చిత్రం రికార్డులను ఇప్పట్లో ఎవరు కూడా బ్రేక్ చేయలేరని, కొంత కాలం వరకు మహేష్ నెం.2 స్థానంలో కొనసాగడం ఖాయం అని అనుకున్నారు.అయితే తాజాగా ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రేపు విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ చిత్రం ‘శ్రీమంతుడు’ కలెక్షన్స్ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినా కూడా ఈ చిత్రంపై సినీ వర్గాల్లో సైతం భారీ ఆసక్తి ఉంది.ప్రముఖ నిర్మాతలు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడంతో ఈ సినిమా స్థాయి ఏంటనేది తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కలెక్షన్స్ 200 కోట్లను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.‘బాహుబలి’ తర్వాత స్థానంలో ఈ సినిమా నిలవడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నెం.2గా నిలుస్తుందా లేక అటుఇటు అవుతుందా చూడాలి.