కరోనా కారణంగా ప్రపంచం మొత్తం కూడా ఎక్కడికి అక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే.ఇండియాలో లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి.
అలాగే ఎన్నో వ్యాపార సంస్థలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయాయి.ఎప్పుడెప్పుడు బస్ లు ప్రారంభం అవుతాయా అని ఎదురు చూసిన వారు ఇప్పుడు అవి స్టార్ట్ అయితే ఎక్కేందుకు భయపడుతున్నారు.
ప్రస్తుతం బస్ లు ఎదుర్కొనే పరిస్థితిని థియేటర్లు ఎదుర్కోబోతున్నాయా అంటే అవును అనే అంతా అంటున్నారు.బస్ లు ఎప్పటి నుండి ప్రారంభ అవుతాయా అని ఎదురు చూసిన వారు ఇప్పుడు వాటిని ఎక్కకుండా ఉన్నారు.
అలాగే థియేటర్లు ప్రారంభం అయినా కూడా భయానికి వస్తారో రారో అనేది చాలా మంది అభిప్రాయం.ఆగస్టు నుండి థియేటర్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సమయంలో థియేటర్లు రెడీ అవుతున్నాయి. పలు సినిమాలను విడుదలకు రెడీ చేస్తున్నారు.ఆగస్టు లో కాకున్నా అక్టోబర్ వరకు అయినా పెద్ద సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.ఆ సమయం వరకు కూడా ప్రేక్షకుల్లో భయం అలాగే ఉంటే మాత్రం థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశం తక్కువే.
ప్రేక్షకులు లేకుండా రాకుండా థియేటర్లు ఓపెన్ చేసినా సినిమాలు విడుదల అయినా కూడా పెద్ద నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.