ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఇకపై బ‌స్సుల‌పై అలాంటి పోస్టర్లు కనిపించవు!

పదవి ఏదైనా సరే వీసీ సజ్జనార్‌ తన అద్భుతమైన తెలివితేటలతో సంచలన నిర్ణయాలు తీసుకొని అందరి మెప్పును పొందుతుంటారు.ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా ఉత్తమ ప్రభుత్వ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఆయన తెలంగాణలో టీఎస్‌ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తాజాగా ఆయన బస్సులపై అశ్లీల చిత్రాలు నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.ఇకపై అశ్లీల, అభ్యంతరకర పోస్టర్లు బస్సులపై అంటించకుండా చర్యలు చేపడతామని వీసీ సజ్జనార్‌ ప్రకటించార.

అయితే ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటిస్తున్న అశ్లీల పోస్టర్ల గురించి అభిరామ్ అనే ఓ జ‌ర్నలిస్టు స‌జ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై వెంటనే స్పందించిన స‌జ్జనార్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు నడుంబిగించారు.

సామాజిక మాధ్యమాల్లో ఒక నెటిజ‌న్ ట్వీట్‌పై స‌జ్జనార్ స్పందించారు.

Telugu Buses, Key, Latest, Posters, Tsrtc-Latest News - Telugu

ఆర్టీసీ బ‌స్సుల‌పై అసభ్యకర పోస్టర్లు తొలగించి కొత్తగా అశ్లీల పోస్టర్లు అంటించకుండా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.ఇక ఆర్టీసీ వ్యవస్థలో పాలనపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు సజ్జనార్ కృషి చేస్తున్నారు.ఇటీవల ఆయన ఒక సామాన్యుడిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను బస్సు సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ స్థాయిలో ఆయన తన ఉద్యోగం పట్ల చూపుతున్న అంకితభావం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube