ఆర్టీసీ ఖమ్మం డిపో అధికారులు,ఉద్యోగుల సమిష్టి కృషి,ఉత్తమ పనితీరుతో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం డిపోను అగ్రస్థానంలో నిలిపారు.మంచిగా పనిచేసే స్వభావం కలిగిన ఉద్యోగులు ఖమ్మం డిపోలో ఉన్నారని,ఖమ్మం డిపో విజయంలో భాగస్వాములైన ఉద్యోగుల అందరికీ డిపో మేనేజరు డి.
శంకర్రావు అభినందనలు తెలిపారు.మంగళవారం హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతల అభినందన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనార్ చేతుల మీదుగా పలువురు ఉద్యోగులు తమ అత్యుత్తమ పనితీరుతో అవార్డులు,ప్రశంసా పత్రాలు,అభినందనలు అందుకున్నారు.”ఒక గొప్ప మార్పుకు శ్రీకారం” పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు ను కరీంనగర్ జోన్ స్థాయిలో ఉత్తమ డిపో మేనేజర్ గాను,”వందరోజుల ఛాలెంజ్” కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గాను అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) వి.గౌతమి ను ఖమ్మం రీజియన్ ఉత్తమ ట్రాఫిక్ సూపర్వైజర్ గాను,అక్కౌంట్స్ సెక్షన్ నుండి ఉత్తమ సూపర్ వైజర్ గా ఖమ్మం డిపోకు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ (ఫైనాన్స్) రాంబాబు లకు మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ ప్రశంసాపత్రాలు ఇచ్చి అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ “వందరోజుల ఛాలెంజ్” కార్యక్రమం సందర్భంగా ఏవిధమైన సెలవులు తీసుకోకుండా విధులు నిర్వహించిన కండక్టరు డి.
యమున,డ్రైవర్ శోభన్ బాబు మరియు “రాఖీ పౌర్ణమి రోజు” అత్యధిక ఆధాయం సాధించినందుకు గాను కండక్టర్లు ఏ.రజిత, జి.శాంత కుమారి,కె.రాజేష్, డ్రైవర్లు ఎం.యస్.నారాయణ,ఎం.కృష్ణ, డి.ఆర్.బాబు మరియు డీజిల్ ఆయిల్ పొదుపులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పి.సంపత్ కుమార్, అత్యుత్తమ పనితీరుతో గ్యారేజి లో విధులు నిర్వహించిన మెకానిక్ సునీల్ తదితర ఖమ్మం డిపో ఉద్యోగులకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కళాభవన్ లో ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.ఖమ్మం డిపో అధికారులు, ఉద్యోగులకు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం సంతోషంగా ఉందని,ఎండి సజ్జనార్ గారి చేతుల మీదుగా అవార్డులు,ప్రశంసా పత్రాలు స్వీకరించి ఖమ్మం డిపోకు విచ్చేసిన డిపో మేనేజరు,అసిస్టెంట్ మేనేజర్(ట్రాఫిక్),ఇతర ఉద్యోగులకు బుధవారం అపూర్వమైన స్వాగతం పలికిన ఖమ్మం డిపో సూపర్వైజర్లు,వివిధ విభాగాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ,అభినందనలు తెలియజేశారు.