ఆర్టీసీ ఎంప్లాయిస్ తలపెట్టిన సమ్మె సీరియస్ అయ్యింది.ప్రభుత్వం ఒకవైపు సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ అవ్వాలని హెచ్చరిస్తున్నా కూడా ఎంప్లాయిస్ యూనియన్స్ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చున్నారు.ఇదే సమయంలో డ్యూటీలో చేరని వారిని స్వచ్చందంగా జాబ్ నుండి తప్పుకుంటున్నట్లుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఈ సమయంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ప్రైవేట్ బస్సులను నడుపుతోంది.
ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక పర్మిట్లు ఇచ్చి మరీ నడుపుతోంది.
ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ ఎంప్లాయిస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.నిన్న పోలీసు వారి సహకారంతో నడిచిన బస్సులను నేడు కూడా అడ్డుకోవాలని ఎంప్లాయిస్ నిర్ణయించుకున్నారు.
అందుకోసం నేటి బతుకమ్మ పండుగను వినియోగించుకోవాలనుకుంటున్నారు.బతుకమ్మలను పేర్చి బస్సుల ముందు పెట్టాలని బస్సులు ముందుకు వెళ్లాలంటే వాటిని తొక్కుకుంటూ వెళ్లాలంటూ ఎంప్లాయిస్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బస్సులను నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లకు పెద్ద తలనొప్పి మొదలైంది.