తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన విషయం తెల్సిందే.సమ్మెలో పాల్గొంటున్న అందరి ఉద్యోగాలు తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో పాటు వారికి అందాల్సిన జీతాలు కూడా రాకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది.
దాంతో పలువురు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.ఈ నేపథ్యంలోనే పలువురు కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ సమయంలో కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు.
ఖమ్మం డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఒంటిపై కిరోసిన్ పోసుకుని మరీ ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.దీంతో పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది.ఇప్పటికే ప్రభుత్వం చేసిన పనితో కార్మికులకు మద్దతుగా పలు ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే.ఇప్పుడు ఈ ఉద్యయం కాస్త మరింత సీరియస్ కాబోతుంది.
ముందు ముందు మరెన్ని సంఘటనలు చూడాల్సి వస్తుందో అంటూ జనాలు ఆందోళన చెందుతున్నారు.