ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.
ఇక తాజాగా రాష్ట్రంలో అమలు పరిచిన కొన్ని సడలింపుల కారణంగా బస్సులు రోడ్లు ఎక్కాయి.ఇక కరోనావైరస్ కట్టడి తరుణంలో ఒక డ్రైవర్ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకునే తరుణంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టడం జరిగింది.
దీనితో పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులు మొత్తం బయటపడ్డారు.ఇక ప్రయాణికులు తెలియజేసిన వివరాలు ప్రకారం… సిరిసిల్ల డిపోకు చెందిన నాన్ స్టాప్ ఆర్ టి సి బస్ కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బయలుదేరింది.
వేములవాడ మండలం అగ్రహారం సమీపంలో కరీంనగర్ పాల డైరీ వద్ద డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెట్టి చేతులకు శానిటైజర్ చేసుకుంటూ ఉండగా బస్సు అదుపు తప్పి డివైడర్ ను డి కొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు.
ఇక వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపి వేయడం జరిగింది.దీనితో బస్సులో ఉన్న వారికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఇక బస్సులో దాదాపు 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.