దేశంలో మోడీ ప్రధాని అయ్యాక మతకలహాల గొడవలు జరుగుతున్నాయి అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.భారతదేశం అందరిదీ అని అంటూ మతసామరస్యం లేకపోతే అభివృద్ధి అసాధ్యమని స్పష్టం చేశారు.
అదే రీతిలో గోగు పేరుతో దాడులు చేసే వాళ్ళు అసలు హిందువులే కాదు అని అన్నారు. హిందువులు, ముస్లిం లు లేదా మరి ఏ మతమైనా ఆధిపత్యం ప్రదర్శించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
అదే విధంగా దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు.జాతీయత అనేది కలిసికట్టుగా ఉంటేనే బలంగా ఉంటుందని పూర్వీకులు నుండి అదే నేర్చుకోవాలి అని… ఆధిపత్యం అంటే అది ఖచ్చితంగా భారతీయత మాత్రమే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.ఇతర మతస్తులను దేశంలో ఉండకూడదు అని అనే హిందువు అసలు హిందువే కాదు అని అన్నారు.