రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మెహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో వివిధ వర్గాల్లో జనాభావ అసమానతలపై ఆయన మాట్లాడారు.
అన్ని వర్గాల వారికి వర్తించే విధంగా సమగ్ర జనాభా విధానాన్ని రూపొందించాలన్నారు.వర్గాల ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమన్న ఆయన.దాన్ని ఎట్టి పరిస్థితుల్లోన విస్మరించకూడదని చెప్పారు.దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉందని, అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తాయని పేర్కొన్నారు.
అనంతరం 57 కోట్ల యువత కలిగిన ఇండియా మరో 30 సంవత్సరాల పాటు యువ దేశంగా ఉండనుందని తెలిపారు.ఇదే సమయంలో జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.