సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో శనివారం టాస్క్ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు జరిపారు.కాగా ఈ దాడుల్లో ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరి నుండి రూ.66 లక్షల 11వేల రూ.100 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇకపోతే పట్టుబడిన నగదును ఐటీశాఖ అధికారులకు అప్పగించడంతో పాటు, ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇక ఒక ఆర్ఎంపీ వైద్యుడి ఇంట్లో ఇన్ని లక్షలు దొరకడం స్దానికులను ఆశ్ఛర్యానికి గురిచేస్తుందట.
అదీగాక చిన్నాచితక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రథమ చికిత్సలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి ఇంట్లో ఇంత మొత్తంలో దొరకడంతో కొందరైతే దీని వెనక పెద్ద స్కాం ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట.
ఇకపోతే ఈ సోదాల్లో హుస్నాబాద్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రవి, టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారని సమాచారం.