అపరిచితుల్ని నమ్మకండని సోషల్ మీడియా, పోలీసులు ఎంతగా చెబుతున్న కొందరు మాత్రం కేటుగాళ్లను నమ్మడం మానలేదు.నమ్మి మోసపోవడం ఆగడం లేదు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన స్దానికంగా కలకలం రేపుతోంది.ఆ వివరాలు చూస్తే.
నగరంలోని రాచకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫోన్ కు కొద్ది రోజుల క్రితం ఓ మెసేజ్ వచ్చిందట.దాని సారాంశం ఎంటంటే. మీ ఫోన్ 24 గంటల్లో పనిచేయడం ఆగిపోతుందని.దాంతో ఆందోళన చెందిన ఆ యువతి ఈ అబద్దాన్ని నిజమేనని నమ్మి ఆ యువతి అతడు చెప్పిన పనల్లా చేయసాగింది.
ఇలా అతను ఆ యువతి ఫోన్ హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ చొప్పించి ఆమె బ్యాంకు వివరాలను కనుగొన్నాడు.దీని సహాయంతో మొత్తం బ్యాంక్ అకౌంట్ నంతా ఖాళీ చేశాడు.
ఈ విషయాన్ని లేటుగా గమనించిన ఆ యువతి గగ్గోలు పెడుతూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి కంప్లెంట్ ఇచ్చింది.ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు జార్ఖండ్ రాష్ట్రం జామ్ తారాకు వెళ్లి బీర్బల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.