వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాల్లో తిరుగుతున్న వారు ఉన్నారు.వందల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారు ఇండియాలో చాలా మంది ఉన్నారు.
ఇక కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుని లేందంటే దొంగతనం చేసిన వారు ఈ సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు.కాని మద్యప్రదేశ్లో మాత్రం 20 రూపాయల కేసు గత 41 ఏళ్లుగా కొనసాగడం అందరిని ఆశ్చర్యపర్చుతోంది.
ఎట్టకేలకు ఈ కేసును రాజీ ద్వారా పరిష్కరించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… 1978వ సంవత్సరంలో బాబూలాల్ మరియు ఇస్మయిల్ ఖాన్లు బస్సులో ప్రయాణం చేస్తున్నారు.ఆ సమయంలోనే బాబులాల్ జేబులో ఉన్న 20 రూపాయలు కనిపించకుండా పోయాయి.దాంతో పక్కనే ఉన్న ఇస్మయిల్ ఖాన్పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.40 ఏళ్ల క్రితం 20 రూపాయలు రెండు వేలతో సమానం.కనుక పోలీసులు ఆ కేసును సీరియస్గానే తీసుకున్నారు.
పోలీసులు కేసును స్వీకరించి ఇస్మయిల్ను అరెస్ట్ చేయడం జరిగింది.
ఇస్మయిల్ ఖాన్ దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్నాడు.
జైల్లో నుండి వ్యక్తిగత పూచికత్తుపై అతడు బయటకు వచ్చాడు.అప్పటి నుండి పోలీసుల వద్దకు వెళ్లి విచారణకు హాజరు అవుతూ ఉండేవాడు.
అయితే 2004వ సంవత్సరం నుండి కోర్టు విచారణకు హాజరు కాలేదు.దాంతో పోలీసులు ఇటీవల ఇస్మయిల్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఇద్దరి మద్య రాజీ కుదర్చాలని పోలీసులు భావించారు.అందుకోసం లోక్ అదాలత్లో విచారణ జరిపించారు.
ఇద్దరి మద్య సయోద్య కుదరడంతో ఇస్మయిల్ ఖాన్ మళ్లీ ఇలాంటి పనులు చేయవద్దని రాతపూర్వకంగా హామీ తీసుకుని వదిలేయడం జరిగింది.
తాజా వార్తలు