తెలుగు సినిమాల సత్తా రోజు రోజుకు పెరిగిపోతుంది.తాజాగా టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు చేస్తున్నారు.
తాజాగా త్రిఫుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతున్నాయి.ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదల కాబోతున్నాయి.
త్రిఫుల్ ఆర్ జనవరి 7న జనాల ముందుకు వస్తోంది.ఆ తర్వాత వారం రోజులకు అంటే 14న రాధేశ్యామ్ రిలీజ్ అవుతుంది.
బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా విజేతగా నిలుస్తుంది? అనే అంశం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.అటు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా ఇదే సమయంలో రిలీజ్ అవుతోంది.
భీమ్లా నాయక్ ముచ్చట అటుంచితే.ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు మాత్రం ఒకదానితో మరొకటి ఢీకొంటున్నాయి.ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సింగిల్ ఈ నెల 24న రిలీజ్ అవుతుంది.ఈ నేపథ్యంలో అది ఎలా ఉంటుంది? అనే ఆసక్తి జనాల్లో నెలకొంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు జనాలను ఆకట్టుకున్నాయి.ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ సెకెండ్ సింగిల్ రిలికల్ విడదులకు కూడా రెడీ అవుతోంది.
అటు రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి చక్కటి ఆదరణ లభించింది.
అయితే రెండు సినిమాల ఆడియోలు కూడా సినిమాల రిలీజ్ కు ముందే పోటీ పడుతున్నాయి.అటు త్రిఫుల్ ఆర్ ప్రమోష్ పై దర్శకనిర్మాతలు కాన్సెంట్రేట్ చేస్తున్నారు.ఈ సినిమాకు పాన్ ఇండియన్ రేంజ్ క్రియేట్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.
అటు ఈ విషయంలో మాత్రం రాధే శ్యామ్ కాస్త వెనకబడి ఉంది.
ఇప్పటికీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టలేదు.ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో కావడంతో ఆయన సినిమాకు పెద్దగా ప్రచారం అవసరం లేదు అనుకుంటున్నారు చిత్ర నిర్మాతలు.అయినా.
విడుదలకు కొద్ది రోజుల ముందు ప్రభాస్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.మొత్తంగా ఈ రెండింటి పోటీలో ఏది విజేతగా నిలుస్తుందో త్వరలో తేలనుంది.
తాజా వార్తలు