టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ను దున్నేయడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవ్వగా, కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే ఇటీవల సినిమా షూటింగ్లకు అనుమతి లభించడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ మొదలవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ మరింత విజృంభిస్తుండటం, సినిమా రంగానికి చెందిన పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.అంతేగాక టాలీవుడ్ హీరోలు 2021లోనే సినిమా షూటింగ్లను నిర్వహించాలని భావిస్తుండటంతో, ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా 2020లో ఇక జరగకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్త గనక నిజం అయితే, ఆర్ఆర్ఆర్ తన షూటింగ్ను 2021లో తిరిగి ప్రారంభిస్తే, సినిమా రిలీజ్ ఏకంగా 2022కి వాయిదా పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇది నిజంగానే ప్రేక్షకులను ఆందోళనకు గురి చేసే వార్త అని చెప్పాలి.