దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ మూవీఆర్ఆర్ఆర్ కోసం యావత్ టాలీవుడ్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ను రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ను క్రియేట్ చేయాలని జక్కన్న అండ్ టీమ్ చూస్తోంది.
ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర రామరాజుకు సంబంధించిన టీజర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్లతో పాటు పలు రకాల పోస్టర్స్, రీసెంట్గా ‘దోస్తీ’ అనే థీమ్ సాంగ్ను రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్.అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు హీరోలను వేరువేరుగా చూపించారు తప్ప ఒక్కసారి స్క్రీన్పై కేవలం థీమ్ సాంగ్లోనే చూపించారు.
దీంతో జక్కన్న ఇప్పుడు మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇద్దరు హీరోలు ఒకేసారి కనిపించే సీన్ను ఒకటి డైలాగ్ టీజర్గా రిలీజ్ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అటు చరణ్ ఫ్యాన్స్తో పాటు తారక్ ఫ్యాన్స్కు పూనకాలు రావడం ఖాయం.మరి ఈ సీన్ ఎలాంటి సందర్భానికి సంబంధించి ఉంటుందో కూడా చూడాలి.
ఏదేమైనా ఈ సినిమా నుండి మరో టీజర్ వస్తుందనే వార్త ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్కు నిద్ర లేకుండా చేస్తోంది.అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా మాత్రం చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ ప్రకటన చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.