నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
లో బడ్జెట్ లో నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించాడు.అయితే సినిమా టీజర్, ట్రైలర్ తోనే జాతిరత్నాలు రెగ్యులర్ సినిమా కాదని, కచ్చితంగా మంచి ఎంటర్టైనర్ అవుతుందనే హైప్ ని క్రియేట్ చేసుకున్నారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ప్రమోషన్ చేయించకుండానే సినిమాని నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ తమ భుజాల మీద వేసుకొని హైప్ పెంచే ప్రయత్నం చేశారు.ఇక అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమా పడిన మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ సినిమాని దర్శకుడు అనుదీప్ నడిపించిన తీరు అద్బుతంగా ఉదంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో తెలుగులో ఈ స్థాయిలో నవ్వించే సినిమా రాలేదని సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా దర్శకుడు, నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే వారి పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
జాతిరత్నాలు పోటీగా మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యి వాటికి హిట్ టాక్ వచ్చిన కూడా దీని స్పీడ్ ముందు ఆ రెండు నిలబడలేకపోతున్నాయి.ఎన్నిసార్లు చూసిన ప్రతి సారి నవ్వుకునేంత ఫన్ ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక సెలబ్రిటీలు కూడా సినిమాని చూసి ఆకాశానికి ఎత్తేస్తున్నారు.తాజాగా జాతిరత్నాలు టీమ్ కి ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది.
జాతి రత్నాల్లో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఒక చిల్లర గ్యాంగ్ గా వచ్చిన వారి పోస్టర్ లు చాలా వరకు ట్రెండ్ అయ్యాయి.అందులో ఒక పోస్టర్ ను ఇలా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో మార్ఫ్ చేసి జాతి రత్నాలు టీమ్ కు చిన్న సర్ప్రైజ్ అంటూ ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా అధికారిక పేజీలో షేర్ చేసి బెస్ట్ విషెస్ ను తెలియజేశారు.