బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.కొద్ది రోజుల క్రితం ఆమె ప్రియుడు రణబీర్ కపూర్ కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.
అప్పుడు ఈమె టెస్ట్ చేయించుకున్న కరోనా నెగిటివ్ వచ్చింది.అయితే మరల రెండు రోజుల క్రితం లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకాగా కరోనా పోజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది.అయితే అలియా భట్ కి కరోనా రావడంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ మీద దాని ప్రభావం పడుతుందేమో అని అందరూ భయపడ్డారు.
అలియా కారణంగా ఆమెతో కలిసి షూట్ లో పాల్గొన్న రామ్ చరణ్ కి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే చిత్ర యూనిట్ కూడా ఆందోళనలో ఉందనే వార్తలు వినిపించాయి.అయితే అలియా కరోనా భారిన పడినా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ ఆలియాకు కరోనా పాజిటివ్ వచ్చింది కదా.మరి షూట్ ఏమైనా డిలే అయ్యే అవకాశముందా అని ప్రశ్నించాడు.దీనికి స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్ నో, కానే కాదు అని సమాధానమిచ్చింది.దీనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా వర్క్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
అలాగే ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ షూట్ లో పాల్గోలేదని ఈ కారణంగానే ఆమెకి పాజిటివ్ వచ్చినా కూడా టీం అంత భయపడటం లేదని తెలుస్తుంది.అయితే ఇప్పటికే రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ఒకసారి కరోనా బారిన పడటంతో అన్ని రకాల కరోనా ప్రివెన్సన్ తీసుకొని షూటింగ్ ని పకడ్బందీగా చేస్తున్నట్లు తెలుస్తుంది.