టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్.ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందటంతో భారీ అంచనాలు వెలువడ్డాయి.పైగా జక్కన్న సినిమా.
అందులో ఇద్దరు స్టార్ హీరోలు ఉండేసరికి ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.
అలా ఈ సినిమా కోసం ఈ స్టార్ హీరోల అభిమానుల ఎదురు చూపులు అంతా ఇంతా కాదు.
గతంలో ఎన్నో సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని రాజమౌళి తెలిపాడు.కానీ కోవిడ్ కారణంతో ఈ సినిమా వాయిదా పడింది.
దీంతో అభిమానులు ఎంతో బాధ పడ్డారు.ఇక మీమర్స్ మాత్రం ఈ సినిమా విడుదలపై తెగ మీమ్స్ క్రియేట్ చేశారు.
రాజమౌళిని లాగుతూ మరి ఘోరంగా ట్రోల్స్ చేశారు.ఇక ఈ సినిమా విడుదల కాదని కావాలంటే టైం మిషన్ లోకి వెళ్లి ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో ఆ డేట్ చూసి చెబుతామని కొందరు మీమర్స్ ఫన్నీ గా క్రియేట్ చేశారు.అంతేకాకుండా అభిమానులు ఈ సినిమా కోసం చూసిన చూపులను కూడా మీమ్స్ రూపంలో అసలు వదలలేదు మీమర్స్.
అలా ఈ సినిమా విడుదల డేట్ వాయిదా పడినప్పటి నుంచి ఏదో ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి సక్సెస్ అందుకునే వరకు మీమర్స్ ఈ సినిమాపై మీమ్స్ చేయకుండా ఉండలేరు అని చెప్పాలి.ఇక ఇదంతా పక్కన పెడితే.
ఇటీవలే జక్కన్న అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు.
ఈ సినిమాను మార్చి 25 న విడుదల చేస్తామని అఫీషియల్ గా తెలిపారు.పరిస్థితులు ఎలా ఉన్నా.25 న విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.దీంతో ఈ డేట్ లపై కూడా మీమ్స్ వస్తున్నాయి.ఇక అప్పుడు కూడా విడుదల చేయకపోతే ఎలా ఉంటుందో మీమ్స్ ద్వారా చూపిస్తున్నారు.కానీ ఈసారి 25 న సినిమా విడుదల చేస్తారని కాస్త నమ్మకం కుదిరినట్లు తెలుస్తోంది.
ఇప్పుడైనా నమ్మండి అంటూ ఓ మీమ్ క్రియేట్ చేశారు.
ప్రస్తుతం ఆ మీమ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో.
కనీసం ఒక్కసారైనా ఈ పిచ్చోడి మాట నమ్మండి అంటూ ఫన్నీగా ట్రోల్ చేశారు.ఇక ప్రస్తుతం ఈ మీమ్ ను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఈసారి ఎలాగైనా సినిమా ఈ డేట్ కి ఫిక్స్ చేస్తారు అని అంటున్నారు.ఎందుకంటే.
ఇలా కూడా ట్రోల్ చేశాక విడుదల చేయకుండా ఉంటారా అని నేరుగా అనేస్తున్నారు.మరి చెప్పిన మాట మీద ఆర్ఆర్ఆర్ బృందం నిల్చుంటుందో లేదో చూడాలి.