రాజమౌళి సినిమాలు అంటే హీరోలు రెండు మూడు ఏళ్ల వరకు ఇతర సినిమాల గురించి మర్చి పోవాల్సిందే.ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఏకంగా అయిదు సంవత్సరాలను కేటాయించిన విషయం తెల్సిందే.
ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాలను కేటాయించడం జరుగుతుంది.వీరిద్దరు కూడా తదుపరి చిత్రాలను వచ్చే ఏడాది విడుదల చేయడం అనుమానమే అనుకుంటూ ఉండగా ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్తో తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాడు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ల కాంబో మూవీని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కాని చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ కాకుండా మరో సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయడం సాధ్యం అయ్యేలా లేదు.
ఎందుకంటే తన తదుపరి చిత్రాన్ని చరణ్ వచ్చే ఏడాదే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.ఇప్పటి వరకు తదుపరి చిత్రంకు సంబంధించిన ఎలాంటి క్లారిటీని చరణ్ ఇవ్వలేదు.
రామ్ చరణ్ కోసం పలువురు దర్శకులు కథలు సిద్దం చేశారు.కాని ఏ ఒక్కటి కూడా ఆయనకు నచ్చలేదు.కొన్ని సినిమాలను పక్కకు అయితే ఉంచాడు కాని వాటిని చేస్తాడో లేదో తెలియదు.అందుకే ఆయన వచ్చే ఏడాది సినిమాను మొదలు పెడితే ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఆ తర్వాత ఏడాదే అంటున్నారు.
అంటే 2021లో ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాబోతున్న చరణ్ తర్వాత చిత్రంను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
.