టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాతో టాలీవుడ్ సత్తాను మరోసారి ఇండియన్ బాక్సాఫీస్కు చూపించాలని దర్శకుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు.
గతంలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను ఈ సినిమాతో చెరిపేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అతి భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథను ఫిక్షన్లో మనకు చూపించేందుకు జక్కన్న రెడీ అయ్యాడు.
తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
కాగా తారక్ ఫస్ట్ లుక్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది.ఇక ఈ సినిమాను తొలుత జూలై 31న రిలీజ్ చేయాలని అనుకున్నా, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఈ సినిమాను జనవరి 8న 2021 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా అనుకున్న సమయానికి ఈ సినిమా రిలీజ్ సాధ్యం కాదని చిత్ర నిర్మాత డివివి దానయ్య అన్నారు.ఓ ఆంగ్ల పత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రిలీజ్ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ మిగిలి ఉందని, లాక్డౌన్ తరువాత దాన్ని పూర్తి చేస్తామని, వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం జరుగుతందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నట్లు ఆయన అన్నారు.దీంతో ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.