దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే బ్లాక్స్టర్ను తన ఖాతాలో వేసుకునేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాను తొలుత 2020 జూలై 31న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ సినిమా షూటింగ్ నెమ్మదిగా జరుగుతుండటంతో ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఇప్పుడు నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయలేమని చిత్ర నిర్మాత తెలిపాడు.
దీంతో ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేస్తారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.అయితే ఈ సినిమాను థియేటర్స్లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని ఓ బ్యూటీ బాంబు పేల్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన పాయల్ ఘోష్, ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఓ ఫన్నీ ట్వీట్ చేసింది.ఈ సినిమాను రాజమౌళి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని, దయచేసి ఇలాంటి సినిమాను థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని ఆమె కోరింది.
దీంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నవ్వుకున్నారు.అసలు ఈ విషయం ఆమెకు ఎవరు చెప్పారు, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే వార్తను ఆమె ఎలా నమ్మిందో అంటూ వారు అంటున్నారు.
ఏదేమైనా ఆమె చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.