తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ కరోనా వల్ల ఆగిపోయిన విషయం తెల్సిందే.
కరోనా భయంతో చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ఇంటికే పరిమితం అయ్యారు.కేవలం ఈ చిత్రం యూనిట్ సభ్యులు మాత్రమే కాకుండా యావత్ దేశంలోని సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
జక్కన్న ఇంట్లోనే అత్యంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఆయనకు మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.ఇప్పుడు ఆ సినిమాకు చెందిన నిర్మాత దానయ్యకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరు దక్కించుకుని స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న ఆయన గత కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నాడు.అయినా కూడా ఆయనకు కరోనా సోకింది.
అది ఎలా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని వైధ్యులు అంటున్నారు.
స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అంటూ తేలిందని దానయ్య సన్నిహితులు అంటున్నారు.అయితే దానయ్య స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయి హోం ఐసోలేషన్ లో ఉంటాడా లేదంటే ఆసుపత్రికి వెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది.