యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేసే పనిలో పడ్డాడు.
కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రంతో ఇండియావైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుక తారక్ రెడీ అయ్యాడు.
అయితే తొలుత ఈ సినిమాను 2021లో ప్రారంభించాలని తారక్ భావించాడు.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు.కరోనా వైరస్ కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండటంతో, తారక్ 30వ చిత్రం కూడా చాలా ఆలస్యం కానుంది.
ఈ సినిమాను 2021లో పట్టాలెక్కించి ఆ ఏడాది చివరినాటికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో తారక్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ను 2022లోనే ప్రారంభిస్తారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏదేమైనా ఓ క్రేజీ ప్రాజెక్ట్తో తారక్ మరోసారి వెండితెరను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాకు న్యూక్లియర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు చిత్ర రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను అతి త్వరలో అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాల తరువాత తారక్ ఎలాంటి సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.