యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కాగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ తాజాగా ఓ షూటింగ్ ముగించేశాడు తారక్.కరోనా భయంతో షూటింగ్లకు హీరోహీరోయిన్లు హాజరు కావడం లేదు.కానీ ఈ కరోనాను లెక్కచేయని తారక్ షూటింగ్ ముగించేయడంతో, ఆయన ఏ షూటింగ్ ముగించాడా అని అందరూ అనుకుంటున్నారు.అయితే తారక్ తాజాగా ఓ యాడ్కు సంబంధించిన షూటింగ్ను ఒకే రోజులో ముగించేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్లోని ఓ స్టూడియోలో యాడ్ షూట్ను జరుపుకున్న తారక్, దాన్ని ఒకే రోజులో ముగించేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఇలా షూటింగ్ జరుపుకున్న తారక్ ధైర్యానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు తారక్ చూస్తుండగా, ఈ సినిమా పూర్తవ్వగానే తన 30వ చిత్ర షూటింగ్ను కూడా మొదలుపెట్టాలని చూస్తున్నాడు.మరి ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలువుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.