దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్టైనర్గా రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్లను తెరకెక్కిస్తున్నాడట జక్కన్న.ఇప్పటికే ఈ సినిమాలో తారక్ ఓ పులితో చేసే ఫైట్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో మరో సీక్వెన్స్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో ఓ ట్రెయిన్ సీక్వెన్స్ను చిత్ర యూనిట్ ఇప్పటికే షూట్ చేసినట్లు తెలుస్తోంది.3 నిమిషాల పాటు జరిగే ఈ ట్రెయిన్ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనుంది.అయితే ఈ 3 నిమిషాల సీక్వెన్స్ను ఏకంగా 30 రోజులపాటు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.
ఓ ప్రైవేట్ స్టూడియోలో వేసిన సెట్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించారట చిత్ర యూనిట్.కాగా ఈ ట్రెయిన్ ఎపిసోడ్లో రామ్ చరణ్, తారక్ ఇద్దరు కలిసి నటిస్తారట.
మొత్తానికి ఈ సినిమాలో చాలా ఎపిసోడ్స్ సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లడంతో పాటు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.