టాలీవుడ్ జక్కన్న ఏదైనా మూవీని ప్రారంభించాడు అంటే రోజుకు ఏదో ఒక పుకారు షికారు చేయాల్సిందే.ప్రతి విషయంలో కూడా జక్కన్న ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక చిన్న విషయం లీక్ అవ్వడం లేదంటే పుకార్లు పుట్టుకు రావడం జరుగుతూనే ఉంటుంది.
తాజాగా జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోలుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లు నటిస్తున్న విషయం తెల్సిందే.
రికార్డు స్థాయి బడ్జెట్తో ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కించబోతున్నాడు.ఈ చిత్రం స్వాతంత్య్రంకు పూర్వం పరిస్థితులతో తెరకెక్కబోతుందట.
ఈ పీరియాడిక్ చిత్రంలో హీరోగా నటించబోతున్న ఎన్టీఆర్ బందిపోటు దొంగగా కనిపించబోడుతున్నాడు.ఇక రామ్ చరణ్ బ్రిటీష్ పరిపాలనలో పోలీసు అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది.బంధిపోటు ఎన్టీఆర్ను రామ్ చరణ్ పట్టుకునే ఆఫీసర్గా నియమితం అవుతున్నాడు.ఎన్టీఆర్, రామ్ చరణ్ల మద్య కథ మలుపులు తిగిరి చివరకు ఇద్దరు ఏకం అవుతారు.ఇద్దరు ఏకం అయ్యి స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు అనేది సినిమా కథ అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నారు.
ప్రస్తుతం స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డిని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.మరో వైపు ఆర్ మల్టీస్టారర్లో కూడా ఇలా స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యం ఉండబోతుంది అంటూ ప్రకటన వచ్చిన నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.తప్పకుండా ఈచిత్రం మరోసారి తెలుగు సినిమా సత్తాను బాలీవుడ్కు చాటుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.