టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. హాలీవుడ్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డీవివి ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర అప్డేట్ ను ఇచ్చారు రాజమౌళి.
త్వరలోనే ఈ సినిమా నుంచి హృదయాలను పిండేసే పాట రానుంది అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఫోటోతో ఫేస్ బుక్ లో షేర్ చేశారు.దీనితో ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది.ఈ పాటను నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్లు జక్కన్న వెల్లడించారు.ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఆత్మీయ పాట.‘జనని’ కోసం పెద్దన్న ఇచ్చిన అద్భతమైన సౌల్ఫుల్ మ్యూజిక్ కంపోజింగ్.ఆర్ఆర్ఆర్లో హృదయాన్ని పిండేసే భావోద్వేగాలు’ అంటూ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి.
ప్రస్తుతం ఎన్టీఆర్, చెర్రీ అభిమానులు ఈ పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.