టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్ కు రంగం సిద్దం అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను ఉక్రెయిన్ లో చేసేందుకు జక్కన్న టీమ్ అక్కడ ల్యాండ్ అయ్యారు.
ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అఫిసియల్ గా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఉక్రెయిన్ లో ల్యాండ్ అవుతున్న సమయంలో వీడియోను తీసిన యూనిట్ సభ్యులు దాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
రాజమౌళి సినిమాలు ఎలా అయితే క్రియేటివిటీతో ఉంటాయో అలాగే ఈ వీడియోను కూడా చాలా క్రియేటివిటీతో తీశారు.విమానం ల్యాండ్ అయిన సమయంలో షూట్ చేయడం జరిగింది.
ఈ వీడియో ప్రత్యేకత ఏంటీ అంటే కేవలం షాడో మాత్రమే చూపించారు.విమానం గాల్లో ఉన్న సమయంలోనే షాడోను చిత్రీకరించారు.
ఉక్రెయిన్ లో రెండు వారాల పాటు షూటింగ్ ను నిర్వహించి ఆ తర్వాత తిరిగి రానున్నారు.అక్కడ చేసిన షెడ్యూల్ తో గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.అక్కడ ఇద్దరు హీరోలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.అద్బుతమైన లొకేషన్స్ లో షూటింగ్ ను చేయబోతున్నారు.
సాదారణంగా జక్కన్న విదేశాల్లో చిత్రీకరణకు ఆసక్తి చూపించడు.కాని కథ డిమాండ్ చేయడం వల్లే అక్కడకు వెళ్లాడు అంటున్నారు.
కథతో పాటు అన్ని విధాలుగా ఉక్రెయిన్ లో సీన్స్ చిత్రీకరణకు బాగుంటుందనే అభిప్రాయంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి ఇద్దరు దిగ్గజ హీరోలను చూపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
విడుదలకు ముందే వెయ్యి కోట్లను ఈ సినిమా దక్కించుకుంది.