యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ప్యారిస్ వెళ్లిన విషయం తెల్సిందే.అక్కడ కొడుకులతో కలిసి ఎన్టీఆర్ సందడి చేశాడు.
ఈఫిల్ టవర్ వద్ద కొడుకులతో సందడి చేసిన ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్ మరియు కుటుంబ సభ్యులు వారం రోజుల్లోనే ఇండియాకు వచ్చేశారు.
ఇటీవలే ఎన్టీఆర్ ఇండియాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్ వచ్చి రాగానే సిరి వెన్నెల సీతారామ శాస్త్రి మృతి చెందడటంతో మీడియా ముందుకు వచ్చాడు.
సిరివెన్నెల తో తనకున్న అనుబంధంను గురించి మీడియాతో ఎన్టీఆర్ షేర్ చేసుకున్నాడు.ఎన్టీఆర్ విదేశాల నుండి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ తో బిజీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది.
నెల కంటే ఎక్కువ రోజులే సినిమా విడుదలకు సమయం ఉన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ట్రైలర్ విడుదల కార్యక్రమం ను భారీ ఎత్తున ముంబయిలో ఏర్పాటు చేయబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులు సూపర్ హిట్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు.బాహుబలి తర్వాత రాబోతున్న సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వం లో ఉండబోతుంది.అది జనవరి లో పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.