రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది.
సినిమాలో చరణ్ నటించిన సన్నివేశాలు మెగా అభిమానులకు ఎంతగానో నచ్చగా తారక్ నటించిన సన్నివేశాలు ఆయన అభిమానులను ఆకట్టుకోవడం గమనార్హం.సినిమాలో తారక్ ఎంట్రీ సీన్, తారక్ ఇంటర్వెల్ ఫైట్ సీన్ హైలెట్ గా నిలిచాయి. భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవించారనే చెప్పాలి.ఈ క్రేజీ సీక్వెన్స్ ల గ్రాఫిక్ వర్క్ కు సంబంధించిన ఫోటోలు తాజాగా రిలీజయ్యాయి.
ఈ ఫోటోలలో ఎన్టీఆర్ లుక్స్ మారకపోయినా బ్యాగ్రౌండ్ లో చాలా మార్పులు చేశారు.సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉండే విధంగా రాజమౌళి జాగ్రత్తలు తీసుకున్నారని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.
ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలు నటులుగా మరో మెట్టు పైకి ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్, చరణ్ ప్రస్తుతం వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా చరణ్ తర్వాత సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.
ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.
ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది దాదాపుగా ఒకే సమయంలో థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.చరణ్ శంకర్ కాంబో మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుంది.