దర్శక దిగ్గజం జక్కన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాని చెక్కే పనిలో ఉన్నాడు.భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన కూడా నిమషాలలో వైరల్ అయిపోతుంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ఆర్ఆర్ఆర్ మూవీ ట్రెండ్ అవుతుంది.ఇదిలా ఉంటే లాక్ డౌన్ ఎఫెక్ట్ తర్వాత ప్రభుత్వం మరల షూటింగ్ లకి పర్మిషన్ ఇవ్వడంతో సినిమాలు అన్ని సెట్స్ పైకి వెళ్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాల్ని ప్లాన్ చేసిన రాజమౌళి గండిపేట సెట్లో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. కొమరం భీమ్ ఎపిసోడ్స్ ను నవంబర్ తొలివారం వరకూ తెరకెక్కించి ఆ తర్వాత చరణ్, ఆలియా భట్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు.ఈ చిత్రంలో తారక్, రామ్ చరణ్ లు కొమరాం భీం, అల్లూరి సీతారామరాజులుగా కనిపించబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం స్వాతంత్య్ర యుద్ధ నేపథ్యంలో ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
అయితే స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి ఆ పాత్రలని స్పూర్తిగా తీసుకొని కొత్త కథని సిద్ధం చేసినట్లు గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అశోకచక్రం, ఇద్దరు హీరోలు చేతులు కలిపినట్లు ఫోటో ఉండటంతో ఈ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
దీంతో మరోసారి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.ఈ ఇద్దరు పాత్రలు చిత్రంలో కలుస్తారు కానీ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన సినిమా అయితే ఇది కాదని ఖచ్చితంగా తేల్చి చెప్పేసారు.
ఇదో ఊహాజనిత కల్పిత కథ మాత్రమే అని స్పష్టం చేశారు.