ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేరకు పూర్తి అయ్యింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.అందువల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో చూడాలి.అయితే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి ఈ సినిమాలో వీళ్ళను రాజమౌళి ఎలా ప్రెసెంట్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక 20 నిముషాలు జరిగే సన్నివేశం ఈ సినిమాకే హైలెట్ అని టాక్ నడుస్తుంది.ఈ భాగం సినిమాలో ఒక పండగలా ఉంటుందట.
ఈ పోరాట సన్నివేశంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలుస్తారని అందుకే ఈ సన్నివేశం సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పుకుంటున్నారు.చూడాలి మరి ఈ సన్నివేశం స్క్రీన్ పై ఎలాంటి సందడి చేస్తుందో
.