టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.తాజాగా నిన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అయ్యింది.
మొదటి రోజు చరణ్ మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటాడని అంతా అనుకున్నారు.ఎన్టీఆర్ పర్సనాలిటీని పెంచే పనిలో ఉన్నాడని, రెండవ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
కాని మొదటి రోజే మొదటి షాట్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లపై జక్కన్న చిత్రీకరించాడు.
నిన్న తెల్లవారు జామునే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే అల్యూమీనియం ఫ్యాక్టరీకి చేరుకున్నారు.అక్కడ భారీ క్రేజ్లతో పాటు, భారీ ఎత్తున టెక్నీషియన్స్ మరియు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.జక్కన్న షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ ముగ్గురు కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ తర్వాత ఎన్టీఆర్ తన ఇన్స్టాలో ముగ్గురు కాళ్లు రౌండ్ గా పెట్టి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు.ఆ ఫొటోతో సినిమాకు తొలి అడుగు పడినది అంటూ సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా నిన్న సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించిన సందడి చేసింది.మొత్తానికి నిన్నంతా కూడా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ గురించి చర్చించడం జరిగింది.సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేశాయి.సోషల్ మీడియాలో రాజమౌళి హీరోలకు రెడీ, యాక్షన్ చెప్పే వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది.
మొత్తానికి షూటింగ్ మొదటి రోజే తెగ సందడి చేశారు.ఈ చిత్రం మొదటి షెడ్యూల్ వారం నుండి పది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.