టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’.ఈ చిత్రం రికార్డు స్థాయి బడ్జెట్తో రూపొందుతున్న విషయం తెల్సిందే.
దానయ్య ఈ సినిమాను దాదాపుగా 350 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
అయితే ఈ సినిమా నిర్మాత దానయ్య గత చిత్రం వినయ విధేయ రామ కారణంగా కాస్త ఆర్థికంగా అడ్డదిడ్డంగా ఉండంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వినయ విధేయ రామ చిత్రంను కొనుగోలు చేసిన బయ్యర్లు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ రైట్స్ను తక్కువ ధరకు తమకే అమ్మాంటూ డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో దానయ్య చాలా తెలివిగా సినిమాను అంతా కూడా హోల్ సేల్ అన్నట్లుగా ఆర్కా మీడియా వారికి అమ్మేయాలని చూస్తున్నాడు.దాదాపు 500 కోట్లకు ఆ నిర్మాణ సంస్థకు ఈ సినిమాను అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలోనే ఈ సినిమాను ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 500 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.కాని అప్పుడు అమ్మని దానయ్య ఇప్పుడు ఆర్కా మీడియాకు రాజమౌళి సలహా మేరకు అమ్మినట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
తాజా వార్తలు