టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా రూ.75 కోట్లకు హక్కులను సొంతం చేసుకున్నాడు.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి.
అటు షూటింగ్లు కూడా వాయిదా పడ్డాయి.ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేందుకు చాలా సమయమే పట్టేటట్లు ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలోనూ ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నాడట.
అందుకే ఆర్ఆర్ఆర్ హక్కులపై మరోసారి చిత్ర నిర్మాత డివివి దానయ్యను కలిసి చర్చించాలని దిల్ రాజు చూస్తున్నాడు.
ఒకవేళ ఈ విషయంపై చిత్ర నిర్మాత స్పందించకపోతే ఈ హక్కులను తిరిగిచ్చేసేందుకు కూడా దిల్ రాజు వెనకాడటం లేదని తెలుస్తోంది.