గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే.దీని వల్ల ప్రపంచం మొత్తం ఆగడంతో ఎన్నో వాణిజ్య, వ్యాపార రంగాలు కూడా నష్టపోయాయి.
అంతే కాకుండా సినీ పరిశ్రమ గురించి, వాయిదా పడ్డ సినిమాల గురించి కూడా అందరికీ తెలిసిందే.కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి గురించి ప్రభుత్వం చేపట్టిన జాగ్రత్తల పరంగా సినిమా షూటింగులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
కరోనా ముందు ప్రారంభమైన షూటింగులు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్న తరుణంలో… రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి మళ్లీ సమయం పడుతుందని తేలింది.
రాజమౌళి గురించి, ఆయన సినిమాల్లో అందించే దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న రాజమౌళి.ఇప్పటివరకు ప్లాప్ అనే మాట వినలేదు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అంతే కాకుండా డివివి దానయ్య నిర్మాతగా వహిస్తున్నారు.
ఈ చిత్రంలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు జీవితంకు సంబంధించిన కథగా రాజమౌళి ఈ చిత్రంలో కొమురం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లను తెరకెక్కిస్తున్నారు.అంతేకాకుండా హీరోయిన్ గా బాలీవుడ్ నటి ఆలియా భట్,ఇంగ్లీష్ నటి ఒలివియ మోరిస్ లను రాజమౌళి నిర్ణయించారు.
ప్రస్తుతం ఈ సినిమా కొంతవరకు పూర్తికాగా ఇంతవరకు ఆలియా ఇందులో ఒక షూట్ లో కూడా పాల్గొన లేదు.కాగా మిగతా భాగం షూటింగ్ పూణె లో ఉన్నందువల్ల ఆలియా భట్ చేయడానికి సిద్ధం కాగా….
ప్రస్తుతం గంగూ బాయ్ కథియావాడి చిత్రంతో బిజీగా ఉన్న ఆలియాభట్, ఈ సినిమాను ఈ నెలలో పూర్తి అవాల్సి ఉండటంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు మరింత ఆలస్యం అవుతుందని వెల్లడించారు.
ఇంతవరకు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక్క షూట్ లో కూడా నటించని ఆలియా భట్ ను తన బిజీ షెడ్యూల్ వల్ల… ముందుగా కొన్ని పాత్రలను ఒకేసారి పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నారు రాజమౌళి.
కాగా ఆలియా కోసం తెలుగు డైలాగుల కై ప్రత్యేకంగా వాయిస్ కోచ్ ను కూడా సిద్ధం చేశారు.కాగా ఆలియా భట్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలిపారు.