ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ది మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పాలి.బాహుబలి వంటి విజువల్ వండర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అప్పుడే మొదలుపెట్టారు చిత్ర నిర్మాతలు.
ఈ సినిమా హక్కులను పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ధర పలకడంతో ఆ ప్రాంతంలోని పాత రికార్డులకు పాతర వేసింది.వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఈ సినిమా హక్కులను ఏకంగా రూ.13 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.గీతా మరియు షణ్ముఖ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేశాయి.
తారక్, చరణ్ లాంటి స్టార్ హీరోలు, రాజమౌళి లాంటి దిగ్గజ డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా మిగతా ప్రాంతాల్లో కూడా పాత రికార్డులకు పాతర వేయడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆర్ఆర్ఆర్ అందరికీ షాకిస్తూ దూసుకెళ్లడం విశేషం.ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.