కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు.జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు.
అలా గుర్తింపు పొందిన వారిలో కిర్రాక్ ఆర్పీ కూడా ఒకరు.చమ్మక్ చంద్ర స్కిట్ లో కంటెస్టెంట్ గా చేసి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్పీ ఆ తర్వాత టీం లీడర్ గా మారి ఎన్నో అద్భుతమైన స్కిట్లు చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
అయితే నాగబాబు జబర్దస్త్ కి దూరం కావటంతో ఆర్పీ కూడా జబర్దస్త్ ని వదిలి మాటీవీలో ప్రసారమైన కామెడీ షోస్ లో సందడి చేశాడు.కొంతకాలానికి ఆ కామెడీ షోస్ మూతపడటంతో అవకాశాలు లేక ఆర్పీ కొంతవరకు ఇబ్బంది పడ్డాడు.
అయితే ఆ సమయంలో జబర్దస్త్ గురించి అక్కడి యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
ఇక ప్రస్తుతం “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” పేరుతో ఒక ఫుడ్ బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు.ప్రస్తుతం ఎక్కడ చూసినా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గురించే మాటలు వినిపిస్తున్నాయి.మొదట కూకట్ పల్లి ఏరియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిన ఆర్పీ అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తడం వల్ల బ్రాంచ్ మూసేసి ఆ తర్వాత మరొక ప్రదేశంలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు.
ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గురించి కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్పీ మండిపడ్డాడు.ఇదిలా ఉండగా ఇటీవల ఆర్పీ గురించి మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్ వద్ద ఆర్పీ ప్రస్తావన తీసుకురాగా… ఆర్పీ గురించి రాకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ ఇంటర్వ్యూలో ఆర్పీ గురించి మాట్లాడుతూ.కిర్రాక్ ఆర్పి ప్రారంభించిన ఈ చేపల పులుసు బిజినెస్ కూడా జబర్దస్త్ పెట్టిన బిక్ష. అతనే కాదు మేమందరం ఇలా ఉండటానికి కూడా జబర్దస్త్ కారణం అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఆర్పీని ఈ మధ్య ఏమైనా కలిశారా? అని యాంకర్ ప్రశ్నించగా.రాకేష్ మాట్లాడుతూ ‘లేదండి.
అంత పెద్దవాళ్లను కలిసేంత అదృష్టం నాకు లేదు.మేమేదో చిన్న ఆర్టిస్టులం, వాళ్లు చాలా పెద్దవాళ్లు’ అని పరోక్షంగా ఆర్పీని విమర్శించాడు.
ప్రస్తుతం రాకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.